విద్యార్థులకు వన్ స్టాప్ సెంటర్ పై అవగాహన సదస్సు

అనకాపల్లి స్థానిక దాసరి గడ్డ వీధిలో మినర్వా ఆధ్వర్యంలో నడుస్తున్న రవీంద్ర భారతి పాఠశాలలో స్కూల్ యాజమాన్యం ఈరోజు నిర్వహించిన వన్ స్టాప్ సెంటర్ అవగాహన సదస్సుకు పోలీస్ శాఖ స్థానిక వన్ స్టాప్ సెంటర్ ఎస్. ఐ పి. రాములమ్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దీనిలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 6 నుంచి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్థానిక వన్ స్టాప్ నిర్వహిస్తున్న టెంపరరీ షెల్టర్, సైకో సోషల్ కౌన్సిలింగ్, మెడికల్ హెల్ప్ , లీగల్ అడ్వైసింగ్, గుడ్ టచ్ బ్యాక్ టచ్, సైబర్ క్రైమ్, పోక్సో, యాంటీ డ్రగ్స్ వంటి వివిధ అంశాలను కూలంకుషంగా విద్యార్థులతో చర్చించి వాటిపై ఏ విధంగా స్పందించాలో, పోలీస్ శాఖ సహాయ సహకారాలు ఏ విధంగా పొందాలో విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ నాగజ్యోతి , వన్ స్టాప్ సిబ్బంది సరస్వతి ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *